ఏలూరు జిల్లాలో పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లాకు జనసేనాని బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఏలూరులో పవన్ పర్యటించనున్నారు.