Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ర‌జ‌నీకాంత్.. ఘ‌నస్వాగ‌తం ప‌లికిన బాల‌కృష్ణ‌

స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో త‌మిళ సూప‌ర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన‌నున్నారు.ఈ మేర‌కు ర‌జ‌నీకాంత్ విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్‌ను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , సావనీర్ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీయర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాల ఆవిష్కరణ సభ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిధిగా, సూపర్ స్టార్ రజినీ కాంత్, నందమూరి బాలకృష్ణ విశిష్ట అతిధులుగా, ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ వెంకటనారాయణ ప్రత్యేక అతిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.చంద్రబాబు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్‌కు తేనేటి విందు ఇవ్వనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img