Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

గవర్నరును కలిసిన సీఎం దంపతులు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతి రాజ్‌భవన్‌లో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నరు దంపతులకు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన విశ్వభూషణ్‌ హరిచందన్‌ చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన విషయం తెల్సిందే. ఆ స్థానంలో కొత్త గవర్నర్‌గా నజీర్‌ శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రమాణ స్వీకార ఉత్సవ ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి 8.15 గంటలకు గవర్నర్‌ దంపతులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దంపతులు పుష్పగుచ్చాలందజేసి ఘన స్వాగతం పలికారు. తాజాగా గురువారం మళ్లీ రాజభవన్‌లో మర్యాదపూర్వకంగా సీఎం దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం, గవర్నర్‌ దంపతులు పరస్పరం దుశ్శాలువలతో సత్కరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఈ సందర్భంగా సీఎం జగన్‌ గవర్నర్‌ దృష్టికి తెచ్చినట్లు తెల్సింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img