Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్‌ ఆరా

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. నిన్న గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్‌ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే గవర్నర్‌కు నవంబర్‌ 15న కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్‌ అందిస్తున్నామని వైద్యులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img