Friday, April 19, 2024
Friday, April 19, 2024

గవర్నర్‌ కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్‌

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ కు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్‌ వీడ్కోలు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ కె.మోషేన్‌ రాజు, రాష్ట్ర గృహ నిర్మాణా శాఖా మంత్రి జోగి రమేష్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగి రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, డీజీపీ కె.రాజేంద్రనాద్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు, శాసన మండలి సభ్యులు డా.ఎం.అరుణ్‌ కుమార్‌, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ, రాష్ట్ర ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, జాయింట్‌ కలెక్టర్‌ డా.అపరాజిత సింగ్‌, ఎయిర్‌ పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం.ఎల్‌.కె.రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img