Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గవర్నర్‌ ను కలిసిన టీడీపీ నేతలు

ఏపీ టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ను కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు పోలీసులు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. యాత్రను అడ్డుకోవడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రచార రథాలు సీజ్‌ చేయడమే కాకుండా మైకులు కూడా లాక్కుంటున్నారని గవర్నర్‌ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు లోకేష్‌ కు ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతుందని ఫిర్యాదులో తెలిపారు. ఏ పాదయాత్రకు లేని అడ్డంకులు లోకేష్‌ పాదయాత్రకే వర్తిస్తాయా ? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ ఫిర్యాదు పై తప్పక న్యాయం చేస్తానని గవర్నర్‌ టీడీపీ నేతలకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img