మంత్రి బాలినేని
గంజాయి సాగు, అక్రమ రవాణా ఇప్పటికప్పుడు పుట్టుకొచ్చింది కాదని, గత ప్రభుత్వం నుండి ఇది కొనసాగుతోందని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఏజెన్సీలో మౌలికవసతుల, ఏర్పాటు గిరిజనులకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. 1995 నుండి అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విధి నిర్వహణలో భాగంగా 22 మంది అమరులు అయ్యారని… వారి కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటవీ సంపద కాపాడడంలో అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న సేవలు వెల కట్టలేనివని కొనియాడారు.