Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గుంటూరు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్‌ కళ్యాణ్‌

ఆదివారం గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనలో తొక్కిసలాట జరగడంతో ఘటన స్థలంలోనే ఓ మహిళ మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో ఇలా జరగడం దురదృష్టకరమని.. ముగ్గురు పేద మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు తగిన భద్రత ఏర్పాటు చేయాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img