Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గుంతకల్లులో ఇద్దరి దారుణ హత్య

విశాలాంధ్ర-గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు ఇద్దరు హత్యకు గురయ్యారు. పట్టణంలోని 60 అడుగుల రోడ్డు సమీపంలో ఉన్న ల్యాండ్‌ లార్డ్‌ హేమ కోటిరెడ్డి (65) తోపాటు ఆయన కారు డ్రైవర్‌ షేక్షావలి(25) ని దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సోఫాలో కూర్చున్న హేమాకోటి రెడ్డి గొంతును పదునైన చాకుతో కోసి పరారు అవుతుండగా అక్కడే ఉన్న ఆయన కారు డ్రైవర్‌ షేక్షావలి దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో షేక్షావలి కుడివైపు పొట్టలోకి కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో అక్కడక్కడే షేక్షావలి కూడా మృతి చెందాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి గుంతకల్లు డీఎస్‌పీ నరసింగప్ప, ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య, టూ టౌన్‌ సీఐ గణేష్‌ చేరుకొని కేసు విచారణ చేపట్టారు. కోటిరెడ్డి ఇంట్లో పని చేస్తున్న వహీదాను పోలీసులు విచారించారు. కొందరు వ్యక్తులు వచ్చి పత్రాలపై సంతకాలు పెట్టాలని కోటిరెడ్డిని అడిగారని, అందుకు కోటిరెడ్డి నిరాకరించడంతో ఆయనను గొంతు కోసి చంపినట్లు తెలిపింది. గతం నుంచి కోటిరెడ్డికి సంబంధించిన ఆస్తి తగాదాలు దీనికి కారణమైనట్లు స్థానికుల సమాచారం. హేమాకోటి రెడ్డి హత్య వార్త తెలుసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హేమాకోటిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందరితో మంచిగా మెలిగే హేమాకోటిరెడ్డి పై ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img