Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గుమ్మలక్ష్మీపురం ఘటనపై మంత్రి సీరియస్‌

కీచక ఉపాధ్యాయుల సస్పెన్షన్‌
విజయనగరం ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం మండలం బాలేను ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వామినాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తక్షణమే విధుల నుంచి తప్పించి విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ తరువాత క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేయాలని మంత్రి సురేష్‌ సూచించారు. కాగా ఈ ఘటనపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు ఉపాధ్యాయులను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసి శాఖ పరమైన చర్యలకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img