పల్నాడు జిల్లా గురజాలలోని ఓ మదర్సాలో విషాదం చోటుచేసుకుంది. గురజాలలోని ఉర్దూ మదర్సా పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి మృతిచెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.మెరుగైన చికిత్స కోసం విద్యార్థులను పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.