Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

గొడవలు సృష్టించేందుకే జగన్ సర్కార్ కుట్ర.. చంద్ర‌బాబు

  • రైతులు, పేదలకు గొడవలు సృష్టించేందుకే జగన్ సర్కార్ కుట్ర పన్నుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు అన్నారు. వ్యూహ కమిటీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్-5 జోన్, విద్యుత్ కోతలు, వివేకా హత్య తదితర అంశాలపై చంద్రబాబు చర్చించారు.
  • పేదలను మోసగించే ప్రక్రియలో భాగంగానే ఆర్-5 జోన్ తీసుకువచ్చారన్నారు. సీఆర్డీఏ బృహత్ ప్రణాళికతో పేదలకు ఐదు శాతం భూమి కేటాయించినప్పుడు రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూరేలా టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహారిస్తోందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img