Friday, April 19, 2024
Friday, April 19, 2024

గొడ్డళ్ళతో దాడి చేస్తుంటే వాళ్లు నిద్రపోతున్నారా?

పల్నాడు ఘటనపై చంద్రబాబు ధ్వజం
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై గ్రామంలో వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసిన ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ హత్యాయత్నాన్ని వైసీపీ రౌడీలు చేసిన పనిగా ఆయన ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, అందుకే పోలీసులు చూసీ చూడనట్లుగా మిన్నకుండిపోయారని విమర్శించారు. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా?’ అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్‌ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని అన్నారు. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్‌ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని ప్రశ్నించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగన్‌ రెడ్డే సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img