టీడీపీ నేతలు రోజూ ఏదో ఒక కుట్ర చేస్తుంటారని.. ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఫేక్ వీడియోతో కుట్ర చేశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదే వీడియో పై ఫోరెన్సిక్ రిపోర్టు అంటూ మరో కుట్ర చేశారన్నారు. మతాలపై దుష్ప్రచారం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయంగా దిగజారి పోయారన్నారు. పవన్ కల్యాణ్ కూడా దిగజారి మాట్లాడుతున్నారని కొడాలి నాని అన్నారు.పవన్ కళ్యాణ్ గుడివాడ ఎమ్మెల్యే అంటూ తన పైన ఇసుక తరలిస్తున్నారంటూ ఆరోపించిన అంశం పైన ఆయన మాట్లాడుతూ, పవన్ అక్కడ 15 ట్రక్కులు తనవే అని చెబుతున్నారని..అందులో అయిదు ట్రక్కులు అయినా తనవి ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేసారు.
చీకోటితో మా పేర్లు చెప్పమని ఒత్తిడి
గుడివాడలో క్యాసినో జరిగిందంటూ అప్పట్లో ప్రచారం చేసారని.. అసలు గుడివాడలో క్యాసినో జరగలేదని వివరించారు. చీకోటి పైన ఈడీ దాడులకు కొందరు రాజకీయ ప్రత్యర్ధులు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ నాని చెప్పుకొచ్చారు. అదే సమయంలో .. తమ ఇద్దరి పేర్లు చెప్పాలంటూ చీకోటి పైన ఒత్తిడి పెంచుతున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అసలు ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్ట చేసారు.