సోషల్ మీడియాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు చెందిన అభ్యంతరకర వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈ అంశంపై ఎంపీ గోరంట్ల మాధవ్ మట్లాడుతూ, తాను జిమ్లో ఉండగా తీసిన ఆ వీడియోను, ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఆరోపించారు. దీనిపై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ అంశంపై ఢల్లీిలో కూడా గోరంట్ల మాధవ్ ఢల్లీిలో మీడియాతో మాట్లాడారు. ‘‘వీడియోలను మార్ఫింగ్ చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రం జరుగుతోంది. నేను ఏ విచారణకైనా సిధ్దం. ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరాను. ఆ వీడియో ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిధ్దమే. తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు చేసిన కుట్ర ఇది. సదరు వ్యక్తులపై నేను పరువు నష్టం దావా కూడా వేస్తాను.’’ అని ఎంపీ మాట్లాడారు. కాగా ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ను అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఓ నిజాయతీ గల పోలీస్ అధికారినని చెప్పుకునే ఆయన ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు. అలాంటిది ఈ తలదించుకునే పనులు ఏంటి అని ప్రశ్నించారు.