Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గౌతమ్‌ సవాంగ్‌కు తగిన శాస్త్తే జరిగింది: నారాయణ

గౌతమ్‌ సవాంగ్‌కు తగిన శాస్తే జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. నిబంధనలు మరిచి పాలకపక్షం అడుగులకు మడుగులొత్తే అధికారులకు గౌతమ్‌ సవాంగ్‌ వ్యవహారంతో కనువిప్పు కలగాలని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి అండగా నిలిచిన సవాంగ్‌ లాంటి వారికే చివరకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా అవమానపరిచారని చెప్పారు. పాలక వర్గానికి కొమ్ము కాస్తే ఇలానే జరుగుతుందన్నారు. ఇక రకంగా గౌతమ్‌ సవాంగ్‌కు తగిన శాస్తే జరిగిందని అన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్‌ లాంటి వారిని ఏపీ ప్రభుత్వం వాడుకుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img