రాష్ట్రం లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్ధను ఏర్పాటు- చేసింది. ఇందులో 1.67 లక్షల మంది ఉద్యోగులు వివిధ కార్యదర్శుల రూపంలో బాధ్యత లు నిర్వర్తిస్తున్నారు. వీరికి రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ కూడా ఖరారు చేసింది. అయితే ఇప్పుడు మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బదిలీల వ్యవహారం తెరపైకి వస్తోంది. దీంతో ప్రభుత్వం తీసుకొ బోయే నిర్ణయం కీలకంగా మారబోతోంది. కాగా, ప్రాథమికంగా అందుతున్న సమాచా రం మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బదిలీల కు అవసరమైన విధివిధానాలను రూపొందించా లని కూడా అధి కార యంత్రాంగానికి ప్రభు త్వం ఆదేశాలు జారీచేసి నట్లు తెలు స్తోంది. అయితే, ఈప్రక్రియ ఈ నెలాఖ రులోగానీ, వచ్చేనెల మొదటి వారం లోగానీ ప్రారం భమవు తుందని తెలు స్తోంది. బదిలీలను ఏఏ అంశాల ప్రాతిపదికన చేపట్టాలన్న దానిపై కూ డా చర్చ ప్రార ంభమైనట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా నాలుగు కేటగిరీల్లో వీరి బదిలీల ప్రక్రియ నిర్వ హించేలా కార్యాచరణ సిద్ధంచేశారని అంటున్నారు.