Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించగా, విజయనగరం వీధుల్లో భారీ భక్త జనసందోహం నడుమ ఊరేగింపు జరిపారు. ఆలయం నుంచి మూడు లాంతర్ల సెంటర్‌ మీదుగా కోట వరకు మూడు పర్యాయాలు సిరిమాను ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు, ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, సిరిమానోత్సవం సందర్భంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తదితరులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త, మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img