Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చంద్రబాబును తిట్టడం కోసమే వైసీపీ ప్లీనరీనా? : వర్ల రామయ్య

వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం పేలవంగా ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. జగన్‌ తాను ముఖ్యమంత్రిని అన్న విషయం మరిచి, కేవలం ప్రతిపక్ష నేతను తిట్టడం కోసమే తన సమయాన్ని వెచ్చించినట్టు కనిపించిందని వర్ల రామయ్య పేర్కొన్నారు. చంద్రబాబును తిట్టటం కోసమే వైసీపీ ప్లీనరీనా ? ప్రశ్నించిన వర్ల రామయ్య చంద్రబాబును దూషిస్తూ పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన విషయాన్ని ఇప్పటికీ గుర్తించడం లేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్ధిక స్థితి గతులు పతనావస్థలో ఉంటే, ఆ విషయాలేవీ ప్రస్తావించకుండా, ప్రజలను మభ్య పెట్టడం కోసం ప్రయత్నం చేశారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ప్లీనరీలో ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రజల సమస్యలను ప్రస్తావించాలని, ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికను తెలియజేయాలని వర్ల రామయ్య వైసీపీ నేతలకు గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img