చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్కు పంపేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్పై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడిరచారని అన్నారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని అన్నారు. జనాగ్రహ దీక్షలో టీడీపీకి తీరుకి నిరసనగా గవర్నర్ లేఖ కోసం సంతకాలు సేకరించామని చెప్పారు.