Friday, April 19, 2024
Friday, April 19, 2024

చంద్రబాబు ఏడుపు రాజకీయాలు పనిచేయవు


ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

చంద్రబాబు తన కంటే నటుడని ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. చంద్రబాబు ఏడుపు రాజకీయాలు పని చేయవని.. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లి నన్ను ఓదార్చండి అని అడగటం ఏంటి? ఇంతకంటే నీచ రాజకీయం ఉంటుందా? అని అన్నారు. కుప్పం ఓటమి ప్రభావం ఆయన మీద బాగా పనిచేస్తోందని చెప్పారు. చంద్రబాబును బాగా ప్రస్టేషన్‌లో ఉన్నారని, అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. అప్పట్లో అలిపిరి ఘటనను అడ్డుపెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు ఏడుపు రాజకీయంతో ఎన్నికలకు వెళ్లినా అంతే అని అన్నారు.ప్రజలకు వాస్తవాలు తెలుసు. తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img