Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దూరులో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్‌ షోలు, సభలకు అనుమతి లేదని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నోటీసులను చంద్రబాబు తిరస్కరించారు. చంద్రబాబుకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డీఎస్పీ సుధాకర్‌ రెడ్డితో చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో పర్యటనను కొనసాగిస్తానని చంద్రబాబు అంటున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img