Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి : మంత్రి బొత్స

రామతీర్థం ఆలయానికి శంకుస్థాపన చేసే ముందు పద్ధతి ప్రకారం అందరిని పిలవడం జరిగిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, అశోక్‌ గజపతిరాజు చెప్పింది శుద్ధ అబద్ధమని అన్నారు. ఆహ్వానం అందించడానికి ఈఓ, ఆలయ అర్చకులు వెళ్లారని, వారిపై అశోక్‌ గజపతిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. శంకుస్థాపన గంట ముందు వెళ్లి శిలాఫలకాన్నీ విసిరివేయాలని చూశారు. అక్కడ ఉన్న సర్పంచ్‌, ఎమ్మెల్సీని అశోక్‌ గజపతిరాజు అడ్డుకున్నారు. అడ్డుకున్న అధికారులను అశోక్‌ గజపతి దుర్బాషలాడారని చెప్పారు. బోర్డులో ఆయన పేరు ఉంది లేదనటం అవాస్తవమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే హక్కులు వాళ్లకి ఉంటాయి. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img