: నారాయణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని… నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో పోలుస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… జగన్ స్థాయి కిమ్కు ఏమాత్రం సరిపోదన్నారు. జగన్కి, కిమ్కు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. అమెరికా లాంటి సామ్రాజ్యవాదాన్ని కిమ్ గడగడలాడిరచారని, మురికిగుంటల్లో చేపలు పట్టుకునే జగన్ లాంటి వాళ్లతో కిమ్ ను పోల్చడం సరికాదని తప్పుబట్టారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవాలనుకోవడం తగదన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్న జగన్కు భయం ఎందుకు? అని ప్రశ్నించారు. బెదిరించి, భయపెట్టి వైసీపీ పాలన చేయాలనుకుంటోందని విమర్శించారు. హత్యా రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోందని నారాయణ దుయ్యబట్టారు.