Friday, April 19, 2024
Friday, April 19, 2024

చంద్రయ్య హత్యకేసు నిందితులు అరెస్టు


గుంటూరుజిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి చెందిన తోటచంద్రయ్య గురువారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడిరచారు. చంద్రయ్య ద్విచక్రవాహనంపై వెళుతుంటే అతన్ని దారిలో ఆపారని, ప్రతిఘటించేలోగా కత్తులతో దాడి చేసి దారుణంగా చంపేశారని చెప్పారు. చంద్రయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారని చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి మొత్తంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 4 బృందాల్లో కలిపి ఆరుగురు ఎస్‌ఐలు ఉన్నారని చెప్పారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని, ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేశామని తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడు చింత శివరామయ్యతోపాటు చింత యలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింత శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింత ఆదినారాయణను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చింత శివరామయ్య, చంద్రయ్య మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయని చెప్పారు. సిమెంటు రోడ్డు విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img