. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు
. చలసాని వెంకట రత్నంకు ఘనంగా నివాళి
. పేద మహిళలకు చీరలు పంపిణీ
విశాలాంధ్ర` విజయవాడ: కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం చలసాని వెంకటరత్నం త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. చలసాని వెంకటరత్నం 51వ వర్ధంతి కార్యక్రమం సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇక్కడి దాసరి భవన్లోని తమ్మినపోత రాజు హాల్లో పార్టీ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన వారు ప్రజల స్మృతిపథంలో జీవించే ఉంటారన్నారు. పేదవారికి న్యాయం చేయాలని, కష్టజీవులకు తగిన ఫలితం దక్కాలి, పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు తొలగిపోవాలి అనేది ఎర్రజెండా విధానం అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పేదరికం, నిరుద్యోగం, రైతులు గురించి మాట్లాడటం లేదన్నారు. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిరదని, ప్రజాస్వామ్యం కూనీ అయిందని, ప్రజలను గౌరవించటం లేదని, రాజకీయ నాయకులకు విలువలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య మతవిద్వేషాలు కల్పించి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని కాపాడుకోవటం కోసం చలసాని లాంటి త్యాగమూర్తులు నడిచిన బాటలో పయనించాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ నగరంలో కమ్యూనిస్టు ఉద్యమానికి పూర్వ వైభవం తీసుకురావటానికి కృషి చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చలసాని నాయకత్వ స్ఫూర్తితోనే కమ్యూనిస్టు ఉద్యమాల్లో చేరి నేడు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. చలసాని వారసత్వ భావజాలాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. మంచి విద్యాబుద్ధులతో, మెరుగైన ఆర్థిక శక్తితో అభివృద్ధిలోకి రావాలంటే ప్రజల ఆస్తుల్ని కొల్లగొడుతున్న పార్టీలకు గుణపాఠం చెప్పి కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలబడాలని కోరారు. చలసాని వర్ధంతి ప్రేరణతో రాబోయే విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో శక్తివంతమైన పార్టీగా కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ చలసాని నీతి, నిజాయితీ, కార్యదక్షతలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్కుమార్ మాట్లాడుతూ విజయవాడలో కమ్యూనిస్టు నాయకునిగా తిరుగులేని శక్తిగా చలసాని ఉండేవారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా కూడు, గూడు కోసం పోరాటాలు చేయాల్సి వస్త్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యాసంస్థల్ని అమ్మేసి ఆ ఆస్తులను కొల్లగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చలసాని స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని సింగ్నగర్, భాస్కరరావుపేట ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించటంలో, పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించటంలో చలసాని అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ముందుగా చలసాని వెంకట రత్నం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తొలుత సీపీఐ విజయ వాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు స్వాగతం పలికారు. మరో సహాయ కార్యదర్శి లంక దుర్గారావు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, దోనేపూడి శంకర్తో పాటు సీపీఐ నాయ కులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణలంకలోని చలసానిభవన్ వద్ద చలసాని చిత్రపటానికి రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు.