Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి భేటీ..

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ భేటీ అయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 26) హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర మంత్రి అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి నివాసానికి వచ్చారు. చిరంజీవి నివాసంలో టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్‌ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేశారు. ఈ సమావేశంలో ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ గురించి చర్చించినట్లు చిరంజీవి వెల్లడిరచారు.
అమెజాన్‌ ఎలక్ట్రానిక్స్‌ బడ్జెట్‌ బజార్‌ ప అమెజాన్‌లో అందుబాటు ధరలకే హై క్వాలిటీ గాడ్జెట్స్‌ %డ% ఎలక్ట్రానిక్స్‌ తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను చిరంజీవి శాలువా కప్పి సత్కరించారు. వినాయకుడి ప్రతిమను బహూకరించారు. ‘హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన మీరు (అనురాగ్‌ ఠాగూర్‌) మమ్మల్ని ప్రత్యేకంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో భారతీయ సినీ పరిశ్రమ గురించి, అది సాధిస్తోన్న పురోగతి గురించి నా సోదరుడు నాగార్జునతో కలిసి మీతో చర్చించడం సంతోషంగా ఉంది’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు తరచూ సినీ ప్రముఖులతో భేటీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్‌, క్రికెట్‌ స్టార్‌ మిథాలీ రాజ్‌ను కలిశారు. రానున్నది ఎన్నికల కాలం కావడంతో తాజాగా చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img