Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చేతులెత్తి నమస్కరించాలంటూ..లోకేష్ పాదయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ను చూసి చాలా బాధ కలిగిందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి . రాష్ట్రం కోసం ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. లోకేష్ కాళ్ల బొబ్బలు పగిలాయని.. ఇదంతా చూసి తనకు కళ్లలో నుంచి నీళ్లు వచ్చాయన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగంతో కంటతడి పెట్టారు. లోకేష్ తల్లిదండ్రులు, భార్యకు నమస్కరిస్తున్నాను అన్నారు.తన కుమారుడు అస్మిత్ రెడ్డి మూడు రోజులు పాదయాత్ర చేసి కాళ్లు నొప్పులు వచ్చాయని అన్నారని.. కానీ లోకేష్ మాత్రం ప్రజల కోసం వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. లోకేష్ ఒక కర్మజీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు. లోకేష్ పాదయాత్రలో సంగ సక్సెస్ అయ్యారని.. విష్ యూ అల్ గుడ్ లక్ అన్నారు జేసీ. కష్టమైనా ఫర్వాలేదని.. లోకేష్ పాదయాత్ర కొనసాగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. రివెంజ్ అనొద్దని.. అందర్నీ క్షమిద్దామని.. కొంతమంది అధికారులు ఉన్నారు.. వాళ్లను మాత్రం విడిచిపెట్టొద్దన్నారు ప్రభాకర్ రెడ్డి.లోకేష్ చిన్న తనం నుంచి ఎండలోకి వచ్చి ఉండడని.. ఇప్పుడు వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంటే అవసరమా అనిపించిందన్నారు. లోకేష్ ఏం తక్కువ..ఎంతో విలాసవంతమైన జీవితం వదిలేసి.. ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారన్నారు.ఆస్తులు లేవా, కార్లు లేవా.. చక్కగా ఎంజాయ్ చేయొచ్చని.. కానీ రాష్ట్రం కోసం ప్రజల్లోకి వచ్చారన్నారు. లోకేష్‌కు ఎన్ని కష్టాలొచ్చినా పాదయాత్రను కొనసాగిస్తున్నారని.. కచ్చితంగా సక్సెస్ అవుతారన్నారు. ఆయన కోసం తాము దేనికైనా రెడీ అన్నారు. కార్యకర్తలు లేకపోతే నేను లేనన్న జేసీ.. చంద్రబాబు చేసిన మంచి పనులతో ప్రజల మనిషి అయ్యారన్నారు. మరోవైపు తాడిపత్రిలో జేసీ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో నారా లోకేష్‌ పాదయాత్ర విజయవంతం కావడంతో టీడీపీ సంబరాలు చేసుకుంది. పోలీసులు వద్దని వారించినా టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్దంగా టపాసులు కాల్చారంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై 286, 290 ఆర్/డబ్ల్యూ ఐపీసీ సెక్షన్ 9 (బి) (1) (బి) ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img