Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జంగారెడ్డిగూడెంలో ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం

శైలజానాథ్‌
జంగారెడ్డిగూడెంలో 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలని ఏపీసీపీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్‌ దాఖలు చేస్తామన్నారు. సీఎం జగన్‌ ప్యాలెస్‌లో కూర్చుంటే పాలన సాగదన్నారు. నాటుసారా తాగి అనేకమంది చనిపోతున్నారని, అధికార యంత్రాంగం ఒత్తిళ్లకు భయపడి సహజ మరణలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. జ్యూడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం చెందిందని, బాధితులకు రూ. 50 లక్షల నష్టపరిహారం తక్షణమే అందించాలని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img