జగనన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణమని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన నేతృత్వంలో జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు. యువతకు భరోసా ఇవ్వడానికి యువశక్తి జరగనుందని తెలుస్తోందన్నారు. రాష్ట్రం కలిసుంటే బాగుంటుందని ప్రజలను అయోమయ స్థితిలోకి నెట్టుతున్నారని తెలిపారు. వారాహి విషయంలో కొందరు ప్రెస్ మీట్ పెట్టి కంగారు పడిపోతున్నారని నాదెండ్ల విమర్శించారు. తాము నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని వెల్లడిరచారు.