జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటివరకు రూ.339 కోట్లు వసూలు అయినట్టు రాష్ట్ర ప్రభత్వం తెలిపింది. మొత్తం 9.86లక్షల మంది లబ్ధిదారులు ఓటీఎస్ స్కీమ్ ద్వారా రూ.10 వేలు చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నట్టు గృహనిర్మాణశాఖ వెల్లడిరచింది. స్వచ్ఛంద పథకంగా దీన్ని ప్రకటించినందున లబ్ధిదారులు ఓటీఎస్ కింద రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.