Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జగన్‌ పాలనలో మహిళలకు భరోసా

హోంమంత్రి సుచరిత
సీఎం జగన్‌ పాలనలో మహిళలకు భరోసా ఏర్పడిరదని హోంమంత్రి సుచరిత చెప్పారు.మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళల భద్రతపై తక్షణం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. దిశ చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని.. దిశ చట్టం కింద 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ నమోదు చేస్తున్నామని తెలిపారు.రమ్య హత్య కేసు నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేశామన్నారు. ఆసుపత్రి వద్ద లోకేష్‌ వ్యవహరించిన తీరు సరికాదన్నారు.చంద్రబాబు పాలనలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయని, సీఎం జగన్‌ పాలనలో మహిళలకు భరోసా ఏర్పడిరదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img