Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదు : లోకేష్‌

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదు వందల మంది మహిళలపై దాడులు జరిగాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. జగన్‌ పాలనలో తాడేపల్లి పరిధిలోని మహిళలకు రక్షణ లేదని చెప్పారు. వైఎస్‌ షర్మీలతో పాదయాత్ర చేయించుకొని తెలంగాణకు పంపించేశాడు, ఇంకో చెల్లిని కన్నీళ్లు మిగిల్చాడని అన్నారు. మంగళవారం లోకేష్‌ కర్నూలులో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దిశా చట్టంతో మహిళలకు రక్షణ లేదని, కానీ సాక్షి టీవీ పత్రికకు కాసుల పంట పండుతోందన్నారు. మహిళలపై దాడులు జరిగితే గన్‌ కంటే ముందొస్తానన్న జగన్‌ ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. హజిరాభీ హత్యకు గురై ఏడాది అయిందని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏమీ చేస్తుందని ప్రశ్నించారు. 21 రోజుల్లో హజీరాభీ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img