Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏంచేశారో చెప్పాలి : పురందేశ్వరి

జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏంచేశారో చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి నిలదీశారు. ఉత్తరాంధ్రలో జలాల కోసం బిజెపి జనపోరు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జగన్‌ ఎందుకు ముఖం చాటేస్తున్నారో చెప్పాలన్నారు. వైస్సార్సీపీ సర్కారు వంశధార నిర్వాసితులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 16 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పూర్తికాకుండా ఉందని అన్నారు. వంశధార ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు వలస వెళుతున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రాజెక్టులపై తమకు అవగాహన ఉందని, ఇక్కడి నేరడి ప్రాజెక్టు కోసం ఒడిశాతో వివాదం ఉందని తెలిపారు. నిర్వాసితులను రాజకీయ ప్రయోజనాల కోసం నమ్మించి ముంచారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img