Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జగన్‌ రాక్షస పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు : నారాయణ

జగన్‌ బటన్‌ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని వెల్లడి
జగన్‌ రాక్షస పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్‌ బటన్‌ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని, ఏపీలో అభివృద్ధి ఎక్కడ ఉందో జగన్‌ చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో జనాల్లో మార్పు కనిపిస్తోందని, జగన్‌ ఏంచేసినా ఓట్లు పడవని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌ పర్యటనలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. లోకేశ్‌ను చూస్తే సీఎం జగన్‌ కు భయమెందుకని అన్నారు. జగన్‌ కు భయం లేకపోతే ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కుతున్నారని నిలదీశారు. 175 సీట్లు వస్తాయని జగన్‌ కు నిజంగా నమ్మకం ఉంటే పోలీసులను అడ్డంపెట్టుకుని తిరగాల్సిన అవసరం ఏంటనిపేర్కొన్నారు. ఏపీకి రూ.13 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయనడం కాకి లెక్కలు మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు మారేవరకు కొత్త పరిశ్రమలు రాలేవని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img