ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తెస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ.. 2023-24 విద్యా సంవత్సరం నుంచి రెండు సెమిస్టర్లు.. అలాగే పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే ఈ సెమిస్టర్ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.