ఏపీలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీకి 8 వార్డులు అనుకూలంగా రావడంతో వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 13 వార్డులో వైసీపీ నేతలు రెండు సార్లు రీకౌంటింగ్ చేయించారు. జగయ్యపేటకు పోలీసు అదనపు బలగాల తరలించారు. జగయ్యపేటలో స్వయంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్చంద్ మానిటరింగ్ చేస్తున్నారు. జగ్గయ్యపేటలో కౌంటింగ్ కేంద్రం తలుపులను అధికారులు మూసి వేశారు. జగ్గయ్యపేట ఓట్ల లెక్కింపు సందర్భంగా 4,13 వార్డుల్లో రీకౌంటింగ్ చేయాలని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్కు స్థానిక అధికారుల తిరస్కరించారు. జగ్గయ్యపేటలోని 4, 13 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు నోటీసు బోర్డులో కూడా అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ కోసం వైసిపి ఒత్తిడి చేస్తుండటంతో నోటీసు బోర్డును తొలగించేందుకు ప్రయత్నించారు.