Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టిటిడి ఈఓ(ఎఫ్‌ఎసి)గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

టిటిడి ఈఓ(ఎఫ్‌ఎసి)గా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఈరోజు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈఓ(ఎఫ్‌ఎసి) వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ(ఎఫ్‌ఎసి) వీరబ్రహ్మం, జేఈఓ సదా భార్గవి కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో నరసింహ కిషోర్‌, డెప్యూటీ ఈఓలు కస్తూరి బాయి, రమేష్‌ బాబు, హరీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img