జనసేన అధినేత పవన్ భరోసా..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. వారి సహేతుకమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. 2010లో కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించిందని గుర్తు చేశారు.మరి కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థలను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు 2016లో వెలువరించిన తీర్పును పూర్తిగా విస్మరించారని అన్నారు. కార్పొరేషన్లో చేరని ఉద్యోగులను బెదిరిస్తున్నారని అన్నారు. ‘కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు.. నిధులు దారి మళ్లించేందుకేనా? బోర్డును నియమించే హక్కు ఎవరికుంది? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? 73 సొసైటీలలో ఉన్న నాలుగు వేల మంది ఉద్యోగులను ఒప్పించ లేకపోయిందా? నాలుగు వేల మంది ఉద్యోగులకు వైసీపీ పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చింది?’ 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు.