Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని కలిసిన డీసీఎంఎస్ చైర్ పర్సన్ అవనాపు భావన దంపతులు

విశాలాంధ్ర- విజయనగరం : తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డిని విజయనగరం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్క అందజేసి, శాలువా కప్పి ఉచితరీతిన సత్కరించారు. విజయనగరం విచ్చేసిన వై. వి. సుబ్బారెడ్డి ని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య స్వగృహంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో అవనాపు విక్రమ్, భావన కలిశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img