తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్గా నేడు వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.