తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత ఏం సమాధానం చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు. మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి తేడాలేదని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఉన్నానంటూ చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ సమర్ధన సిగ్గుచేటన్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. టీడీపీ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు.