Friday, April 19, 2024
Friday, April 19, 2024

టీడీపీలోకి జమ్మలమడుగు నేతలు..

వలసపక్షులకు టీడీపీలో స్థానం లేదు : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కడప జిల్లా జమ్మలమడుగు నేతలు టీడీపీలో చేరారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి తదితరులు చేరారు. టీడీపీలో చేరిన వెంటనే భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం పార్టీ లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. జమ్మలమడుగు టిడిపి కి కంచుకోటని భూపేష్‌ రెడ్డి యువకుడు.. రాజకీయ భవిష్యత్‌ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ వీడిన వారి గురించి చంద్రబాబు ప్రస్తావించారు. కొందరు పార్టీని వీడారు.. అయితే పార్టీని నమ్ముకున్నవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అంబెద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.పార్టీ లో చేరికల సందర్భం గా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పై వలస పక్షులకు టీడీపీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఎన్నికల ముందు వాసన పసిగట్టి పార్టీ లో చేరేవారికి అవకాశం ఇవ్వనని చెప్పారు. కష్టకాలంలో పార్టీకోసం పని చేసిన వారికే ఎన్నికల్లో ఇకపై గుర్తింపు ఉంటుందన్న బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాను గతం లో ఈ సిద్ధాంతంలో కఠినం గా ఉండలేక పోయానని చెప్పిన టీడీపీ అధినేత .. పార్టీలో ఎవరేంటో అన్ని రికార్డ్స్‌ లో రాసిపెడుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img