మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైస్సార్సీపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరినట్టు ఆ పార్టీ నేత నారా లోకేష్ తెలిపారు. నేడు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలానికి చెందిన కొన్ని గ్రామాల వారు కొందరు వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు తన సమక్షంలో టీడీపీ పార్టీలో చేరినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైస్సార్సీపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారంతా పార్టీని విడిచిపెట్టినట్టు లోకేష్ తెలిపారు. . వైస్సార్సీపీ కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టు చెప్పారు.