Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

టీడీపీ అభ్యర్థులను గెలిపించి వైసీపీకి బుద్ది చెప్పాలి

కుప్పంలో ఎన్నికల ప్రచారంలో లోకేష్‌
కుప్పం ప్రజలు అమ్మకానికి సిద్దంగా లేరని, వైసీపీ రౌడీయిజానికి.. బెదిరింపులకు.. భయపడేవారుకాదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన రెండున్నారేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో దొంగదారిన ఒక వార్దును ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. మిగిలిన వన్నీ టీడీపీ అభ్యర్థులను గెలిపించి వైసీపీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తనను కుప్పం ఎమ్మెల్యేగా పోటీచేయమన్నారని.. అయితే ఇక్కడి ప్రజల గుండెల్లో దేవుడులా గూడుకట్టుకున్న చంద్రన్న ఉన్నంత వరకూ ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే… కాబోయే ముఖ్యమంత్రి.. అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినవని, ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెబుతారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img