బొత్స సత్యనారాయణ
వన్టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ను పేదలందరికీ ఉచిత ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం కలిగించేందుకే ప్రవేశపెట్టామని మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది బలవంతపు పథకం కాదని స్పష్టంచేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తిస్తుందని తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.కాగా, దీనిపై వివాదాస్పద ఆదేశాలు ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఒక పథకం ప్రకారం.. టీడీపీ కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందన్నారు.