Friday, April 19, 2024
Friday, April 19, 2024

టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది : విజయసాయిరెడ్డి

ఎన్టీఆర్‌ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోందని, మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌ కి కంస మామ జగన్‌ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు. తండ్రి కొడుకులు బుద్ది మార్చుకోకపోతే తగిన బుద్ది చెప్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తాన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు సంవత్సరం ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయన్నారు. పార్టీ ఆఫీస్‌ అంటే దేవాలయం లాంటిదని మా నమ్మకమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img