ధృవీకరించిన పార్టీ డిజిటల్ వింగ్
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా(జైటీడీపీ) హ్యాకింగ్కు గురైంది. ఈ మేరకు టీడీపీ డిటిజల్ వింగ్ (ఐటీడీపీ అఫీషియల్) శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేసింది. వైసీపీ మద్దతుతో కొందరు వ్యక్తులు తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపింది. అంతేకాకుండా ఈ కుట్రను ఛేదించి అతి త్వరలోనే టీడీపీ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇటీవలే ఓ సారి టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గంటల వ్యవధిలోనే టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో ఆ పార్టీ డిటిజల్ బృందం సఫలీకృతమైంది. తాజాగా టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం గమనార్హం.