Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

టీడీపీ తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలుస్తుంది : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలుస్తుందని, అందుకు తాము ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడమే నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.ఈరోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరుగుతున్న సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ల చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని గత తెలుగుదేశం హయాంలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేశాం. ఒంటిమిట్ట ఆలయ నిర్వహణలో లోపాలు రాకూడదన్న ఉద్దేశంతో టీటీడీ పరిపాలన కిందకు తెచ్చాం. కల్యాణ వేదికను నిర్మించి ఆలయానికి కొత్త శోభను తెచ్చామని అన్నారు. తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలుస్తుంది అనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img