Friday, April 19, 2024
Friday, April 19, 2024

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ నిరాహారదీక్ష

ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ రద్దును నిరసిస్తూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ నిరాహారదీక్షకు దిగారు. ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు ఆయన దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా శ్రీరామ్‌ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ నేతలపై మండిపడ్డారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ ను రద్దు చేస్తే వైస్సార్సీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ డివిజన్‌ గా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ధర్మవరానికి ఆ హోదాను తొలగించడం అన్యాయమని అన్నారు. ధర్మవరం అభివృద్ధిని వెనక్కి నెట్టేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img